బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఇప్పటికీ కుదుటపడలేదు. అక్కడ హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు హింస కొనసాగుతూనే ఉన్నాయి. రక్షణ కల్పించమని పోలీసులకు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతోపాటుగా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా హిందువులను వేధించడం మరింత దారుణం. నేరుగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తుండడంతో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హిందువులను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వమే ఆంక్షలు దిగుతోంది. దీంతో పోలీసులకు విషయం అర్థం అవుతోంది. రక్షణ కోసం హిందువులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించినప్పటికీ ఉపయోగమండటం లేదు. ప్రభుత్వం బాటలోని హిందువులను బయట నుంచో పెడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో హిందువుల పండగలు ఉత్సవాల మీద ఆంక్షలు విధించారు. బంగ్లాదేశ్లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.
బహిరంగంగా హిందువులకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆదేశాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు.
బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకునే దాడులు హింసకు దిగడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. కానీ భారతదేశంలోని సెక్యులర్ ముసుగులో ఉన్న రాజకీయ పార్టీలు మాత్రం దీని మీద నోరు మెదపడం లేదు.