రాముడు, కృష్ణుడితో పాటు రామాయణానికి, భగవద్గీతకు … వాటిని అందించిన వాల్మీకి, వ్యాసమహర్షులను దేశం గౌరవించుకోవాలని…జాతీయ గుర్తింపునిస్తూ……పార్లమెంట్లో చట్టం తేవాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఓ వ్యక్తి నాస్తికుడిగా ఉండడానికి ఈ రాజ్యాంగం అనుమతిస్తుంది అంటే… దేవీదేవతల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయడం కాదని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అన్నారు. హిందీ దేవీదేవీలను అసభ్యంగా చిత్రిస్తూ..వాటిని సోషల్మీడియాలో షేర్ చేసిన హత్రస్ కు చెందిన ఆకాశ్ అనే యువకుడి కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పలువురి ఫిర్యాదుతో పోలీసులు జనవరి 4న అతన్ని అరెస్ట్ చేశారు.
భారతీయ సంస్కృతి గురించి నేటి తరానికి అవగాహనన కల్పించాలని…దేశంలోని అన్ని సబ్జెక్టుల్లోనూ సబ్జెక్టుగా చేయాలనీ కోర్టు వ్యాఖ్యానించింది. దేవీదేవుళ్లను అసభ్యంగా చిత్రీకరించిన యువకుడు 10నెలలుగా జైల్లో ఉన్నాడని…ప్రపంచంలో మరే దేశంలో అయినా ఇలాంటి నేరాలకు తీవ్రమైన శిక్షలుంటాయని న్యాయమూర్తి అన్నారు.
ఇటీవల రామజన్మభూమిపై వచ్చిన తీర్పునూ ఆయన ప్రస్తావించారు. భగవంతుడిగా రాముడిని భారతీయులు కొలుస్తున్నారని… రాముడిలేని భారతదేశ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు. భారతీయుల విశ్వాసాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.