రాష్ట్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య నెలకొన్ని సందిగ్ధం వీడింది. బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించడం లేదని..హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచనతో ఇటు ప్రభుత్వం, అటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ద నిర్వహణకు నిర్ణయించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగానికి కూడా అంగీకరించినట్టు ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. అలాగే అసెంబ్లీలో బడ్దెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ సైతం అంగీకరించారని రాజ్ భవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ కోర్టుకు తెలిపారు.