న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్ల సమావేశంలో తీర్మానాన్నిఏకగ్రీవంగా ఆమోదించారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లు. దాన్ని 65 ఏళ్లకు పెంచారు. ఇక సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 67 ఏళ్లకు పెంచాలని తీర్మానించారు. తీర్మానాన్నిప్రధానికి, న్యాయశాఖకు పంపనున్నారు. మొన్నటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీరమణ న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంపును సమర్థించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.