ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు.ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక స్పీకర్ సమయాన్ని కోరారు ఆయన..ఈనెల 8న అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా సభాపతిని కోరారు. ఆ రోజు స్పీకర్ కు రాజీనామా సమర్పిస్తానని తెలిపారు.
మునుగోడు ప్రజల మేలుకోసమే రాజీనామా చేస్తున్నరాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నిక జరిగే నియోజవర్గానికి రాష్ట్రప్రభుత్వం నిధులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచక పాలనపై కాంగ్రెస్ పోరాడలేకపోతోందని… టీఆర్ఎస్ ను డీకొట్టేది బీజేపేనని తాను నమ్ముతున్నానని రాజగోపాల్ రెడ్డిమరోసారి స్పష్టంచేశారు.