దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయని.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదార్ పూనావాలా ఈరోజు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో భేటీ అనంతరం అదార్ పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు.
నా సమావేశం ఎప్పటిలాగే బాగా జరిగింది. వ్యాక్సిన్ కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. దీని గురించి మంత్రికి వివరించాను. మంకీపాక్స్ కు వ్యాక్సిన్ పై మేం పరిశోధన చేస్తున్నామని అదర్ పూనావాలా అన్నారు.
డయాగ్నస్టిక్స్, వ్యాక్సిన్ ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి నేషనల్ టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాదవియా తెలిపారు.