గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. రాజ్ పథ్ లో జరిగిన పరేడ్లో కోవింద్ , ప్రధానిమోదీ సహా పలువురు పాల్గొన్నారు. త్రివిధదళాల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రపతి. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు.. దేశ ఆయుధ సంపత్తిని సైన్య పరాక్రమాన్నీ చాటుతూ సాగిన త్రివిధదళాల కవాతు ఆకట్టుకుంది. విశిష్ట సేవలందించిన వారికి పతకాలు ప్రదానం చేశారు.
ప్రదర్శనను వేలాదిమంది ప్రత్యక్షంగా… కోట్లాదిమంది టీవీల్లోప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
అంతకుముందు ఇండియా గేట్ వార్ మెమోరియల్ దగ్గర మోదీ నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈసారి నేతాజీ జయంతి అయిన జనవరి 23నుంచే వేడుకలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇండియాగేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని ప్రారంభించారు.
ఇక పరేడ్ లో భాగంగా…
అన్ని రాష్ట్రాల శకటాలు, కేంద్ర మంత్రిత్వశాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు మధ్య వేడుకలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు.
ఎప్పట్లాగే ఒకరోజు ముందుగానే రాష్ట్రపతి కోవింద్ దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు.