రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించకూడదన్న తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూహైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిందేనంది. గణతంత్ర వేడుకల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ పంపిన సంగతి తెలిసిందే. కేంద్రం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై పిటిషనర్ల లంచ్ మోషన్ దాఖలు చేశారు. అటు రాజ్ భవన్లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ తెలంగాణ సర్కారు గవర్నర్ కు లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాననీ అన్నారు. రాజ్ భవన్లో పతాకావిష్కర చేసిన అనంతరం తమిళిసై సొంతవిమానంలో పుదుచ్చేరి వెళ్లి అక్కడ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారని తెలిసింది.