హిజాబ్ వివాదం సద్దుమణిగిన తరుణంలో అల్ ఖైదా చీఫ్ అయ్ మన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో సందేశం కలకలం రేపుతోంది. అయితే ఎప్పుడో 2020లో చనిపోయాడనుకున్న అల్ జవహర్ తాజా వివాదాలపై మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ఆయన బతికే ఉన్నాడని స్పష్టమవుతోంది. భారత్ లో ఇస్లాంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చాడు అల్ జవహరి. మీడియాను వాడుకుంటూ తెలివిగా పోరాడాలని సూచించాడు.
జవహిరి వీడియోను అల్ ఖైదా మీడియా మంగళవారం పోస్ట్ చేసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా కొందరు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండగా, ముస్కాన్ ఖాన్ అనే ముస్లిం విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని నినదించడాన్ని జవహిరి ఈ వీడియోలో ప్రశంసించాడు. ఆమె తక్బీర్ నినాదాన్ని వినిపిస్తూ జిహాద్ స్ఫూర్తిని బలోపేతం చేసిందని మెచ్చుకున్నాడు జవహరి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)