ప్రముఖ రచయిత్రి, దివంగత రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో..పలు ఆరోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మలక్ పేటలోని సొంతింట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఉన్నత విద్యావంతురాలైన రామలక్ష్మి తెలుగు స్వతంత్ర లో ఇంగ్లిష్ విభాగానికి సబ్ ఎడిటర్ గా పనిచేశారు. సాహితీవేత్త, సాహితీ విమర్శకుడైన ఆరుద్రను వివాహం చేసుకున్న తరువాత ఆయన ప్రోత్సాహంతోనే రచనలు చేశారు. రామలక్ష్మి ఆరుద్ర కలంపేరుతో ఆమె రచనా వ్యాసంగం సాగింది. వారికి ముగ్గురు కుమార్తెలు.