ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ దృష్ట్యా చార్టర్ విమానాలు కూడా నడవచ్చని పేర్కొంది. విమానాల సంఖ్యను పెంచాలని భారతీయ విమానయాన సంస్థలకు ఇప్పటికే సమాచారం అందించామని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ సౌకర్యాలు కల్పిస్తోంది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)