బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి)ని పునర్నిర్మించారు. రెండు ప్యానెల్ ల నుంచి సీనియర్ నేతలు శివరాజ్సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలను తొలగించారు. నూతనంగా ఎన్నుకొన్న బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్లో కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యెడియూరప్ప, సుధా యాదవ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సర్బానంద సోనోవాల్, కె లక్ష్మణ్ సహా సత్యనారయణ జాతియా ఉన్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో కొత్తగా చేరిన వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, భూపేంద్ర యాదవ్ సహా ఓం మాథుర్ ఉన్నారు.