సొంత ఊళ్లకు వెళ్లే అవసరం లేకుండానే… ఉన్నచోట నుంచే ఓటుహక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్ను తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. దూరప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన చాలామంది ఆసక్తి లేకనో, ప్రయాణ ఖర్చులకు భయపడో ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నారు. అలా దాదాపు మూడోవంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉంటున్న పరిస్థితి. దీంతో ఉన్నచోట నుంచే ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మిషన్ ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది సీఈసీ. ఇందుకోసం ఓ కాన్సెప్ట్ నోట్ ను సిద్ధంచేసిన ఈసీ…రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను సైతం సిద్ధం చేసింది. జనవరి 26న మిషన్ ప్రదర్శన ఉంటుందంటూ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించాల్సి అవసరంఉందని..అన్ని పార్టీలూ తమ అభిప్రాయాలు చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది.