జనగణకు సన్నాహాలు ప్రారంభమౌతున్నవేళ గతానికి సంబంధించిన వివరాలు విశ్లేషణలు పరిస్థితులను అర్ధంచేయించేందుకు pew రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ మనకు ఉపయోగపడుతుంది , అట్లాగే 2011 నుండి 2021 వరకు అంచనాలు భవిష్యత్ పరిణామాలు అవగాహన చేసుకొనేందుకు దోహదపడుతుంది ,ఈ దిశలోదినిని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాము.
పదేళ్లకోసారి చేసే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) డాటాను పరిశీలించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ భారత్లో మతాల జనాభాలలో చోటుచేసుకున్న మార్పులు, అందుకు దారి తీసిన కారణాలను విశ్లేషించింది.వాటి వివరాలు గమనిద్దాము1951లో 36.1 కోట్లుగా ఉన్న భారత్ జనాభా 2011 నాటికి 120 కోట్లకు పెరిగింది. స్వతంత్ర భారతదేశంలో తొలి జనగణన 1951లో నిర్వహించగా చివరి జనగణన 2011లో జరిగింది. 2011 తరువాత 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది.ఈ 60 ఏళ్ల వ్యవధిలో భారత్లోని అన్ని మతాల జనాభా పెరిగింది.
స్వాతంత్రానంతరం భారతదేశంలో వలసలు, మతమార్పిడులు కారణంగా మతపరమైన జనాభా నిష్పత్తిలో తేడాలు కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి, 1947 తర్వాత ఈ ఆరు దశాబ్దాల కాలంలో మతాల పరంగా జనాభా మూడు రెట్లు పెరిగింది.పెరుగుదల ఎలా ఉందంటే ఉదాహరణకు 2020 వ సంవత్సరంలో సుమారుగా ప్రతి నెల ఒక మిలియన్ జనాభా పెరిగింది ఈ క్రమం ఇలాగే ఉంటే 2030నాటికి చైనా జనాభా అధిగమించే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఈ దేశంలో నివసించే ప్రజల్లో 99 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ జన్మించిన వారే ఉన్నారు.
మతాల వారి జనాభా పెరుగుదల 1951- 2011 మధ్య ఎట్లా ఉన్నదో చూద్దాం
1)1951లో హిందువుల జనాభా 304 మిలియన్లు ఉంటే 2011 నాటికి 966 మిలియన్లు అయింది
2) అదే 1951లో ముస్లిం జనాభా 35 మిలియన్ అంటే 2011 నాటికి 172 మిలియన్ లైంది,
3) క్రైస్తవులు 8 మిలియన్ లు 1951 నాటికి ఉంటే 2011 నాటికి 28 మిలియన్లకు చేరింది,
4)పై మూడు మతాలు కాకుండా మిగిలిన మతాల వాళ్ళు దేశ జనాభాలో 3% శాతంగా ఉంటే ఆ సంఖ్య 10 లక్షలకు పెరిగింది.
5)1951లో సిక్ సాంప్రదాయం వాళ్లు 7 మిలియన్లు ఉంటే 2011 నాటికి 21 మిలియన్లు ఉంది,
6)బౌద్ధులు జైనులు పెరుగుదల కూడా సుమారుగా అట్లాగే ఉంది .
7) 1951లో ఉన్న దేశ జనాభాలో 4.4% ఉన్న ముస్లింలు 2011 నాటికి 14.2% గా మారారు, అదే క్రమంలో 4.3 % హిందువుల జనాభా తగ్గుదల ఉన్నది, అంటే హిందువుల జనాభా 79.8% కి పడిపోయింది, క్రైస్తవులు2% ఉంటే వాళ్లు 3% కి పెరిగారు
2011 జనాభా లెక్కల ప్రకారం
1)భారతదేశంలో 30 వేల మంది మేము నాస్తికులని 2011 జనాభా లెక్కల సేకరణ లో చెప్పారు
2) భారతదేశంలో ప్రధాన మతాలతో సంబంధం లేని వాళ్ళు 8 మిలియన్ల మంది ఉన్నారని 2011 జనాభా లెక్కల్లో తేలింది
3) భారతదేశంలో ఆరు ప్రధాన మతాలు కాకుండా 83 చిన్నచిన్న మతాలు సంప్రదాయాలు వాళ్ళు ఉన్నారు అని కూడాఆ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది
4) 120 కోట్ల భారత జనాభాలో హిందువులు 79.8%ఉన్నారు. ప్రపంచ హిందూ జనాభాలో 94%భారత్లోనే నివసిస్తున్నారు.
5) భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల శాతం 14.2%. ఇండోనేసియా తరువాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్.
6) క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు భారత జనాభాలో 6% ఉన్నారు.
7) హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందనివారు 80 లక్షల మంది భారత్లో ఉన్నారు.
2001 నుండి 2011 మధ్య దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల
2001 నుండి 2011 మధ్య దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల సంఖ్య 24.7% ఉంటే అదే మిగిలిన వారు 17.7% ఉన్నారు, అంటే ముస్లింజనాభా 7% పెరుగుదల అధికంగా ఉంది. భారతదేశంలో సంతానోత్పత్తి వేగంగా క్షీణిస్తోంది ప్రతి మహిళా సగటున 2.2 మంది పిల్లలను కంటోంది , ఇంత తక్కువగా ఉన్నా ప్రపంచ అభివృద్ధి దేశాల కంటే ఎక్కువగా ఉంది, ఉదాహరణకు అమెరికాలో ప్రతి మహిళ 1.6 పిల్లల్ని కంటోంది భారత దేశంలో ముస్లిం సంతానోత్పత్తి 1992లో 4.4 మంది పిల్లల్ని కంటే 2015లో 2.6 మంది పిల్లలను కంటున్నారు కొద్దిగా తగ్గినా మొత్తంమీద ముస్లిం జనాభా సంతానోత్పత్తి పెరుగుతున్నది ఇదే ఇట్లాగే కొనసాగితే భవిష్యత్ ప్రమాద సంకేతాలు దానిలో కనబడుతున్నాయి. ఈ వివరాలు భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తే మొత్తం మీద ఇస్లాం జనాభా భారతదేశంలో అంచనాలకు మించి పెరుగుతున్నది.