సుప్రీంకోర్టులో నూపుర్ శర్మకు ఉపశమనం లభించింది. తదుపరి విచారణ వరకు ఆమెను ఆరెస్ట్ చేయవద్దని ఆయా రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తన అరెస్టులపై మినహాయింపులు ఇవ్వాలని..తనపై నమోదైన కేసులన్నింటిని ఒకేచోటకు బదిలీచేయాలని ఆమె వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేసులు నమోదయిన రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోంలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. న్యాయ ప్రత్యమ్నాలను అన్వేషించే క్రమంలో ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పింది. ఈ కేసులో వాదనలు ఆగస్టు 10న వాదనలు వింటామంది. ఇక నూపుర్ ను చంపేస్తామన్న బెదిరింపులు ఎక్కువయ్యాయని… ఆమెకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.