ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబంధాలున్నాయన్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చిన సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా ఏకంగా ఆమెకు నోటీసులు సైతం ఇవ్వడం చర్చనీయాంశమైంది.ఇంకా ప్రముఖ రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తల పేర్లు ఈ స్కాంలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.