ఏ రంగంలోనైనా సంస్కరణలు తీసుకొచ్చిన మొదట్లో కొంత ఇబ్బందికరంగా అనిపించినా…తరువాతి కాలంలో వాటి ఫలితాలు అందరకూ అందుతాయని ప్రధాని మోదీ అన్నారు. అగ్నిపథ్ పై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సంస్కరణల దీర్ఘకాలిక ప్రయోజనాలు పోనుపోను దేశం అర్థం చేసుకుంటుందన్నారు. బెంగళూరులో ఓ కార్యక్రమం వేదికగా మాట్లాడిన ఆయన… విపక్షాల విమర్శలు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అటు అగ్నిపథ్ లో భాగంగా అగ్నివీర్ ల ఎంపిక కోసం భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని ఆర్మీ పేర్కొంది.