భారతదేశంలో పేదరికం 2011తో పోలిస్తే 2019లో 12.3 శాతం పాయింట్లు తగ్గింది. 2011లో 22.5 శాతం నుంచి 2019లో 10.2 శాతానికి పడిపోయింది. వరల్డ్ బ్యాంకు “పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్” గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. 2011 నుంచి 2019 మధ్యకాలంలో గ్రామాల్లో పేదరికం 14.7 శాతం తగ్గగా.. పట్టణాల్లో పేదరికం 7.9 శాతం తగ్గింది.
అధ్యయనం ప్రకారం,తక్కువ ఎకరాల భూమిని కలిగి ఉన్న రైతులు అధిక ఆదాయ వృద్ధిని పొందారు. 2013, 2019లో జరిపిన రెండు సర్వే రౌండ్ల మధ్య అధిక భూములు కలిగిన రైతులు 2 శాతం వృద్ధి చెందితే.. అతి తక్కువ భూములు కలిగిన రైతుల ఆదాయం వార్షికంగా 10 శాతం పెరిగాయి.