ఎర్రకోట హింస కేసు.. డచ్ జాతీయుడు అరెస్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసలో మరో ఇద్దరు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు డచ్ జాతీయుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. మరొకరు పంజాబీగా గుర్తించారు. వీరిలో ఒకరు జనవరి 26వ తేదీన ఎర్రకోట వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వీరిని ఖేమ్ ప్రీత్ సింగ్, మణిందర్జిత్ సింగ్గా గుర్తించారు. మణిందర్ డచ్ జాతీయుడని.. ఖేమ్ప్రీత్ పంజాబీ అని పోలీసులు తెలిపారు. అయితే మణిందర్ జిత్పై అంతకుముందు కూడా నేరచరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మణిందర్ బర్మింగ్హామ్లో స్థిరపడ్డాడని.. నకిలీ డాక్యుంమెంట్లతో దేశం దాటి పోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు పట్టుబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు ఎర్రకోట హింస కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు.
https://twitter.com/ANI/status/1369495669942095875