వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగింది. బెంగాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. మిగతా అంతా సజావుగా కొనసాగింది. సాయంత్రం 6.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 6.00 గంటల వరకు లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసోంలో 73.03 శాతం పోలింగ్ నమోదవ్వగా.. వెస్ట్ బెంగాల్లో 80.43 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. అయితే బెంగాల్లో పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే ఈ సారి దీదీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
73.03% and 80.43% voter turnout recorded till 6 pm in the second phase of polling in Assam and West Bengal, respectively: Election Commission of India
— ANI (@ANI) April 1, 2021