
ఎన్నికల ముంగిట ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్దూను కేబినెట్ నుంచి తొలగించిన తరువాత…తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్ చేశారని కెప్టెన్ చెప్పుకొచ్చారు. సిద్దూతో ఇమ్రాన్ కున్న స్నేహం గురించి చెబుతూ…ఆయన్ని మంత్రిగా మళ్లీ తీసుకోవాలని పాకిస్తాన్ నుంచి తనకు విజ్ఞప్తులు వచ్చాయని అమరీందర్ సింగ్ అన్నారు.
‘సిద్దూ మా ప్రధానికి పాత మిత్రులు. మీరు అతన్ని కేబినెట్లోకి మళ్లీ తీసుకుంటే మంచిది. మళ్లీ అతను సరిగా పనిచేయకుంటే అప్పుడు మీరు తొలగించవచ్చు’ అని పాకిస్తాన్ నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. కెప్టెన్ సీఎంగా ఉండగా సిద్దూను కేబినెట్ నుంచి తొలగించారు. కెప్టెన్ రాజీనామా తరువాత పీసీసీ చీఫ్ గా సిద్దూను నియమించింది కాంగ్రెస్.
అసలు మెదడు లేని, పనికిరాని వ్యక్తిని పార్టీలో చేర్చుకోనేవద్దని ఐదేళ్లక్రితమే తాను సోనియాగాంధీకి సూచించానని అమరీందర్ సింగ్ వెల్లడించారు. సిద్దూ ఎలాంటి వాడో ఆరా తీయమని కాంగ్రెస్ చీఫ్ చెప్పిన వెంటనే…అతను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పూర్తిగా అనర్హుడని చెప్పానని, అయినా అతన్ని పార్టీలోకి తీసుకున్నారనీ అన్నారు.
సిద్ధూతో ముందునుంచీ కెప్టెన్ కు పొసగలేదు. పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వడంలేదంటూ గత సెప్టెంబర్లోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కూడా సిధ్దూపై తీవ్ర ఆరోపణలే చేశారు. సిద్దూ ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహితుడని, పాకిస్తాన్ జనరల్ కమర్ బజ్వాతో సంబంధాలున్నందున ఆయన వల్ల దేశభద్రతకు ఎప్పటికైనా ముప్పేననీ అప్పుడు ఆరోపించారు కెప్టెన్.
పంజాబ్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు, అవినీతి జరుగుతోందని కెప్టెన్ వ్యాఖ్యానించారు. అక్రమ ఇసుక తవ్వకాల్లో సీఎం చన్నీ ప్రమేయం లేదనడం అబద్ధమన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని అమరీందర్ సింగ్ అన్నారు. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కెప్టెన్ సిద్దూ,కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు.
సిద్దూను కేబినెట్లోకి తీసుకోవాలని పాక్ నుంచి, ఇమ్రాన్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి : కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎన్నికల ముంగిట ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్దూను కేబినెట్ నుంచి తొలగించిన తరువాత…తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్ చేశారని కెప్టెన్ చెప్పుకొచ్చారు. సిద్దూతో ఇమ్రాన్ కున్న స్నేహం గురించి చెబుతూ…ఆయన్ని మంత్రిగా మళ్లీ తీసుకోవాలని పాకిస్తాన్ నుంచి తనకు విజ్ఞప్తులు వచ్చాయని అమరీందర్ సింగ్ అన్నారు.
‘సిద్దూ మా ప్రధానికి పాత మిత్రులు. మీరు అతన్ని కేబినెట్లోకి మళ్లీ తీసుకుంటే మంచిది. మళ్లీ అతను సరిగా పనిచేయకుంటే అప్పుడు మీరు తొలగించవచ్చు’ అని పాకిస్తాన్ నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. కెప్టెన్ సీఎంగా ఉండగా సిద్దూను కేబినెట్ నుంచి తొలగించారు. కెప్టెన్ రాజీనామా తరువాత పీసీసీ చీఫ్ గా సిద్దూను నియమించింది కాంగ్రెస్.
అసలు మెదడు లేని, పనికిరాని వ్యక్తిని పార్టీలో చేర్చుకోనేవద్దని ఐదేళ్లక్రితమే తాను సోనియాగాంధీకి సూచించానని అమరీందర్ సింగ్ వెల్లడించారు. సిద్దూ ఎలాంటి వాడో ఆరా తీయమని కాంగ్రెస్ చీఫ్ చెప్పిన వెంటనే…అతను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పూర్తిగా అనర్హుడని చెప్పానని, అయినా అతన్ని పార్టీలోకి తీసుకున్నారనీ అన్నారు.
సిద్ధూతో ముందునుంచీ కెప్టెన్ కు పొసగలేదు. పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వడంలేదంటూ గత సెప్టెంబర్లోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కూడా సిధ్దూపై తీవ్ర ఆరోపణలే చేశారు. సిద్దూ ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహితుడని, పాకిస్తాన్ జనరల్ కమర్ బజ్వాతో సంబంధాలున్నందున ఆయన వల్ల దేశభద్రతకు ఎప్పటికైనా ముప్పేననీ అప్పుడు ఆరోపించారు కెప్టెన్.
పంజాబ్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు, అవినీతి జరుగుతోందని కెప్టెన్ వ్యాఖ్యానించారు. అక్రమ ఇసుక తవ్వకాల్లో సీఎం చన్నీ ప్రమేయం లేదనడం అబద్ధమన్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని అమరీందర్ సింగ్ అన్నారు. ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కెప్టెన్ సిద్దూ,కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు.
Share: