ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీమార్పిడి సర్జరీ జరిగింది. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీ దానంచేశారు. సర్జరీకి కొన్ని క్షణాలముందు రోహిణి తన చిత్రాన్ని జతచేస్తూ తండ్రిపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా కిడ్నీని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ‘మేం దేవుడిని చూడలేదు, కానీ దేవుడు లాగా ఉన్న మా నాన్నను చూశాం’’ అని రోహిణి ట్వీట్ చేశారు. తన తండ్రికి కిడ్నీ దానం చేయడం తన అదృష్టమని ..జన్మనిచ్చిన తన తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నారు లాలూ రెండో కుమార్తె రోహిణి.
हमने ईश्वर न देखा है
मगर ईश्वर के रूप में
अपने पापा को देखा है☺️🧿🤞🙏 pic.twitter.com/sOEp6FEwea— Rohini Acharya (@RohiniAcharya2) December 3, 2022