కరోనా కల్లోల కాలంలో కేంద్రప్రభుత్వానికి అండగా ముందుకు వచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్… భారీగా నిధులను తరలించాలని నిర్ణయించింది ఆర్బీఐ. 99 వేల 122 కోట్ల మిగులు ధనాన్ని డివిడెంట్ రూపంలో కేంద్రసర్కారు ఖజానాకు బదిలీ చేసేందుకు సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో జులై నుండి జూన్ ఆర్థిక సంవత్సరంగా పరిగణించి బదిలీ చేయగా, ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుండి మార్చిగా పరిగణించి బదిలీ చేయనుంది. తాజాగా ప్రకటించిన మిగులు జూలై 2020 నుంచి మార్చి 2021 వరకు అంటే 9 నెలలకాలానికి ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ శక్తికాంతదాస ఆధ్వర్యంలో జరిగిన బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు జరిగాయి.
కరోనా కారణంలా ఆదాయం భారీగా పడిపోయి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందిం. దీంతో డివిడెంట్ రూపంలో బ్యాంక్ ఇస్తున్న ఈ పెద్దమొత్తపు నిధులు సర్కారుకు ఉపయోగపడాయి. కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్బీఐకి భారీగా ఆదాయం లభిస్తుంది. ఈ ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత తన కార్య కలాపాలకు మినహాయించుకుని మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు సెంట్రల్ బ్యాంకు తీసుకున్న విధాన చర్యలను, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచ, దేశీయ సవాళ్లను ఆర్బిఐ బోర్డు సమీక్షించింది. గత ఏడాది కూడా రూ. 57 వేల కోట్ల మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది ఆర్బీఐ.