ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో ఇతర ప్రముఖుల ఫొటోలతో మార్చనున్నారన్న వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తోసిపుచ్చింది. గాంధీ ఫోటోను రవీంద్రనాథ్ ఠాగూర్, APJ అబ్దుల్ కలాంలతో భర్తీ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, RBI యోచిస్తున్నట్లు నిన్నటి నుంచి అనేక నివేదికలు పేర్కొన్నాయి.
దీనిపై RBI స్పందించింది. ప్రస్తుత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ముఖాన్ని మార్పులు చేసే ప్రతిపాదన లేదని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ ఫోటోను రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాంతో భర్తీ చేస్తున్నారన్న వాదనలు ఇప్పటికే మీడియాలో నివేదికలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్లో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని గమనించాలి’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
https://twitter.com/RBI/status/1533737262923792384?s=20&t=vkNufLScmfVYp6diGPKTuw