ఈ సంస్కృతి ప్రశ్నించడానికి, విమర్శించడానికి, పరిశోధించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. ప్రజలకు ఉపయోగపడాలి అనే ధ్యేయంతో మాత్రమే మహా ఋషులు బోల్డు పరిశోధనలు చేసి మానవుని సుఖ జీవనానికి కావలసిన తిండి, గుడ్డ, నివాసం ఆరోగ్యం, విద్య ఇలా ప్రతీ దానిలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరు ఇంత కష్టపడి శోధించి సాధించడానికి ప్రేరణ ఏమిటి? నేటి ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన మేధావుల్లా కోట్లు పోగేసుకుందుకా? కానే కాదు. ఇక్కడ వారికి ముఖ్య ప్రేరణ దైవం, మానవ శ్రేయస్సు. ఆ దైవం అనే శక్తి నుండి స్ఫూర్తి పొంది నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అబ్బురపడేలా ఖగోళ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు మొదలుకొని ఆయుర్వేదం లో అతి చిన్న మూలికల ఉపయోగం వరకు వేల సం.ల క్రిందటే కనుక్కున్నారు. ఇక్కడ ఈ పుణ్యభూమిలో అన్ని వేల సం.ల క్రిందటే శాస్త్రవేత్తలకు (ఋషులకు) పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తే ఈ మధ్య 17 శతాబ్దంలో కూడా మా దైవ గ్రంధాల్లో చెప్పిన వాటికి విరుద్ధంగా పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నారు అని శాస్త్రజ్ఞులను చంపిన ఘన సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఉండేది.
ఆ తరువాత వెయ్యి సం. ల పరాయి పాలన, స్వాతంత్రం వచ్చినా పాశ్చాత్య వైరస్ తో పుట్టిన పాలకులు ఈ భూమి మీద జరిగిన పరిశోధనలకు గాని, ఆవిష్కరణలకు గాని వీసమంత విలువ ఇచ్చి వాటిని పునరుద్ధరించే పనిచెయ్యలేదు. వేయి సం.ల పరాయిపాలనలో మరుగునపడి ఈ ప్రజల జీన్స్ లో ఏ మూలో వుండే ఆ ‘పరిశోధన చెయ్యాలి కొత్తవి ఆవిష్కరించాలి’ అనే దాన్ని బయటికి తీసి ప్రోత్సహించే ప్రయత్నాలు జరగకపోగా మనకు ఏమీ తెలియదు అనే ఆత్మన్యూన్యత సామాన్య జనాల్లో పెంచి పోషించి, ఆఖరుకు అగ్గిపెట్టలో పట్టె చీర నేయగల సామర్ధ్యం ఉన్న ప్రజలు బట్టలు కుట్టుకునే సూది దిగుమతి చేసుకునే హీన స్థాయికి తీసుకువచ్చారు.
ఈ పుణ్యభూమికి సరిపడని పాశ్చాత్య పదాలు, పద్దతులు, ఆచారాలు, ఇజాలు దిగుమతి చేసుకుని స్వావలంబన అనే పద్దతిలో పెరిగిన ఈ సంస్కృతీ ప్రజలకు అన్నిటికి ఇతరులపై ఆధారపడే సంస్కృతి రుద్దారు.
ఇక్కడ ఈ పుణ్యభూమిలో వేల సం.ల క్రిందటే నాస్తికత్వం ఉండేది. ఎడారి మతాలలో లాగా దేవుని ఉనికిని ప్రశ్నించే వారిని నరికి చంపిన చరిత్ర లేదు. ఆస్తికులు, నాస్తికులు తమ వాద ప్రతివాద విద్వత్తుతోనే పై చేయి సాధించడానికి ప్రయత్నించేవారు.
కానీ నేడు నాస్తికత్వం హేతువాద ముసుగులో జరుగుతున్నది ఏమిటి? ప్రజలకు ప్రశ్నించడం మీద, పరిశోధనల మీద ఇంత విశాల దృక్పధం, స్వేచ్ఛ ఇచ్చిన ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయడం తూలనాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ప్రతీ దానిలో దేవుణ్ణి చూసుకోండి అన్న విశాలదృక్పధం బోధించే ఈ ధర్మాన్ని మా దేవుడు ఒక్కడే నమ్మకపోతే నరకానికి పోతారు, మా దేవుడికి, దైవ గ్రంధాలకు అవమానం జరిగితే తలలు నరికేస్తాం అని మూఢత్వాన్ని బోధించే మతాలతో పోల్చి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళను కూడా రెచ్చగొట్టి వాళ్లలో కూడా మూఢత్వం పెంచే దిశగా ప్రేరేపిస్తున్నారు.
వాళ్ళను వారి దేవుళ్లను, మత గ్రంధాలను, ఆచారాలను, పండగలను, కట్టు బొట్టును విమరిస్తే తలలు తెగుతాయి అనే భయంతో మీరు నవరంధ్రాలు మూసుకొని హేతువాదం, నాస్తికవాదం ముసుగులో పూర్తి వాక్స్వాతంత్రం, స్వేచ్ఛ ఇచ్చిన/ ఇస్తున్న ఈ సనాతన ధర్మంలో రంధ్రాన్వేషణ చేస్తున్నారు.
ఏమిటి నిజంగా మీ ఎజెండా? ప్రజల్లో శాస్త్రీయ దృక్పధం పెంచడమా లేదా విదేశీ మతాల ప్రేరణతో ఇక్కడ సనాతన ధర్మాన్ని బలహీన పరచడమా? మీకు నిజంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పధం పెంచాలి అంటే ఏ మతబోధనలు వల్ల ప్రజలు నిజంగా ఉన్మాదులుగా తయారుఆవుతున్నారో గుర్తించి వాటి మీద దాడి చెయ్యాలి. కానీ అది మానేసి సనాతన ధర్మం మీద పడుతున్నారు.
హిందువులు అతి పవిత్రంగా భావించే రామాయణ కల్పవృక్షాన్ని రంకు నాయకమ్మ తన విషపు, హీన ఆలోచనలతో వక్రీకరించి ఒక పుస్తకం రాస్తే బురదలో ఉన్న పంది మీద రాయి వేస్తే మన మీదకే వస్తుంది అన్న చందాన హిందువులు దాన్ని పట్టించుకోలేదు. అదే ఏ ఖురాన్ మీదో బైబిల్ మీదో పుస్తకం కాదు ఒక వాక్యం రాసి ఉంటే అప్పుడే ఆవిడ తల తెగి పడేది.
హిందువుల ఈ సహనశీలతను అలుసుగా తీసుకొని నాస్తిక హేతువాద ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. ఈ భారతభూమి ఖండింపబడక ముందు మీ వంటి వాచాలత్వం వుండే వారు ఆఫగణిస్తాన్, పాక్, బంగ్లాలో హాయిగా నోరు పారేసుకునే వారు. ఇప్పుడు అవి వేరే దేశాలుగా రూపాంతరం చెంది సనాతన ధర్మాన్ని అక్కడ కూకటి వేళ్ళతో పెగిలించిన తరువాత మీ వంటి వారు అక్కడ నోరు పారేసుకోలేక అక్కడ నుండి పారిపోయి ప్రాణాలు నిలుపుకున్నారు.
ఇంత స్వేచ్ఛ ఇస్తున్న ధర్మాన్ని ఆచరిస్తున్న మెజార్టీ హిందువుల విశ్వాసాలను తూలనాడినట్లు మైనార్టీ మతస్థులు విశ్వాసాలను వెక్కిరించగలరా? లేరు. ఎందుకంటే మీ మెడ మీద తలకాయలు ఉండవు అని భయంతో. మీ వంటి వెధవల గాడ్ది కొడుకుల హ్రస్వ దృస్థి వల్ల పొరుగుదేశాల్లో బలహీన పడినట్లే ఇక్కడ కూడా సనాతనధర్మం బలహీన పడి అతి మూఢ విశ్వాసాలు పాటించే వారు ఎక్కువ అయితే జారిపోతున్న పేంట్లు పైకి లాక్కుంటా విదేశాలు పారిపోడానికి రెడీ అయ్యే బాచ్ లో మీరే ముందు ఉంటారు.
ఇప్పటి అయినా కళ్ళు తెరవండి. సనాతన ధర్మాన్ని పరిరక్షించండి. దాని ఆచరణలో ఎక్కడో ఒకటో ఆరో లోపాలు ఉంటే హుందాగా చర్చించి ప్రజల్లో చైతన్యం తెండి. అదే సమయంలో మీ ద్వంద ప్రమాణాలు వీడి మిగతా మౌఢ్య మతాలు పెరిగితే మానవాళికి వచ్చే ముప్పు వివరించండి. ధైర్యం ఉంటే ఎక్కడ మౌఢ్యం అన్న వైరస్ ఉందొ అక్కడ వాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నించండి.
చివరగా..మీరు సనాతన ధర్మాన్ని బలహీన పరచగలం అని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ భూమి మీద ధర్మం నిలబెట్టడానికి ఇక్కడ ప్రజలచే ఎప్పుడు కలం పట్టించాలో ఎప్పుడు ఖడ్గం పట్టించాలో ఈ గడ్డకు తెలుసు.. నమస్తే..
🙏🙏🙏
…చాడా శాస్త్రి…