ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ హిందూసంస్థలు ఎదుర్కొంటున్నా క్రైస్తవ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బోథ్ మండలంలోని గ్రామాల్లో బలవంతపు మత మార్పిళ్లు యధేచ్ఛగా సాగుతున్నాయి. ఆదివాసీల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని…వారికి బ్యాంక్ ఎకౌంట్లు ఓపెన్ చేయించి డబ్బులు జమ చేస్తూ ప్రలోభపెడుతున్నారు. అయితే కొందరు స్థానిక యువకులకు విషయం తెలిసి అడ్డుకోవడంతో మతమార్పిడి బృందం వెనక్కి వెళ్లినట్టు తెలిసింది. ఇంకా కొన్ని చోట్ల అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాలు కడుతామని గ్రామాల్లోకి చేరి చర్చి నిర్మాణాలు సాగిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
కోట-కె గ్రామంలోకి వచ్చి చర్చి కట్టేందుకు ప్రయత్నించిన పలువురిని అడ్డుకుని తిప్పిపంపించారు కొన్ని హిందూ సంఘాల ప్రతినిధులు. క్రైస్తవ మాఫియా ఆగడాలు పెరగడంతో హిందుసంస్థలు సైతం అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ స్థానికులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
బోథ్ మండలంలోని సోనాల చుట్టుపక్కల ఆదివాసిగూడేలైన కేశవ్ గూడ, మహదు గూడ, జైతూగూడ, లెండి గూడ వంటి చోట్ల చిన్నపిల్లలను సైతం ప్రలోభపెడ్తున్నారు. చాక్లెట్, బిస్కళ్ల ఆశచూపుతూ ముందు పిల్లలను మచ్చిక చేసుకుంటున్నట్టు తెలిసింది. పిల్లల ద్వారా కుటుంబాలకు దగ్గరై రైతులకు టార్చిలైట్లు, సైకిళ్లు వంటివిస్తూ..ఇతరత్రా అవసరాలు తీరుస్తున్నారు. కొన్నిచోట్ల గూడేల్లో బోర్లు కూడా వేయిస్తూ స్థానికులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్ వాక్యాలను గోండు భాషల్లోకి తర్దుమా చేసి వీడియో, ఆడియోలు ప్రదర్శస్తూ ప్రచారం చేస్తున్నారని స్థానిక యువత అంటోంది.
అలాంటి ఓ ముఠాను సైతం స్థానికులు కొందరు అడ్డుకున్న ఘటనలు జరిగాయి, వారి వాహనాలను, గోండు భాషలో ఉన్న క్రైస్తవ ప్రచార వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా మత ప్రచారం ఎక్కువవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – శ్రీధర్ మునిగెల