అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంగ్ (ఏబీఆర్ఎస్ ఎమ్) మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలో “ఇంప్లిమెంటేషన్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -20 20” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సత్య కుమార్ మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా భారత దేశ విద్యా విధానంలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని,, ప్రపంచంలో విద్యారంగంలో మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో మార్పులకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29 వ తేదీన నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు.
అదేవిధంగా దేశంలోని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ రంగాలలో మూడు కోట్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని కానీ 26 కోట్ల మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసి ఉందని కావున ప్రభుత్వ రంగంలోనే కాకుండా ఐటి, ఫార్మా ,అగ్రికల్చర్ ,ఇన్ఫ్రా, డైరీ మొదలైన రంగాలలోనే కాకుండా ప్రతి విద్యార్థి స్వయం ఉపాధి పొందే విధంగా నూతన జాతీయ విద్యా విధానంలో దాదాపు 45 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టారని ప్రతి విద్యార్థి తన అభివృద్ధికి అనుగుణంగా ఈ 45 స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో ఏ ఏ కోర్సులో అయినా తర్ఫీదు పొంది విద్య పూర్తి అయిన తర్వాత స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని తెలియజేశారు.
అదేవిధంగా చైనా, జపాన్ ,జర్మనీ వంటి దేశాలు ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందు తున్నాయని కానీ వారి విద్యాభ్యాసం అంతా కూడా మాతృభాషలోనే జరుగుతుందని కావున భారతదేశంలో కూడా విద్యార్థి యొక్క అభిరుచికి అనుగుణంగా మాతృభాషలోనే విద్యను బోధించే అవకాశాన్ని కల్పించాలని తెలియజేశారు. భారతీయ విద్యార్థులు జ్ఞానాన్ని అనుసరించే వారు కాకుండా జ్ఞానాన్ని తయారు చేసే వారుగా ఎదగాలని దీనికి జాతీయ విద్యా విధానంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.
ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మంది విద్యార్థిని ,విద్యార్థులు ఉన్నారని 1500 విశ్వవిద్యాలయాలు ,46 వేల కళాశాలలు మరియు కొన్ని లక్షల పాఠశాలలు ఉన్నాయని వీటన్నింటిలో కూడా మౌలిక వసతుల మెరుగు కోసం ప్రస్తుతము బడ్జెట్లో కేటాయిస్తున్న జిడిపి ని కనీసం 6% గా పెంచాలని ఈ సందర్భంగా మంత్రి శ
సత్య కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఆర్ఎస్ ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్ ,రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై వి రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రంగనాథ్ ,సెమినార్ కన్వీనర్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బాలసుబ్రమణ్యం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ , ఏ బి ఆర్ ఎస్ ఎం రాష్ట్ర మహిళా ప్రతినిధి డాక్టర్ శ్రీదేవి ,యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అవి చల్ రాజ్ కపూర్, సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్ నార్ల వినయ్ మరియు రాష్ట్రములోని వివిధ డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 300 మంది అధ్యాపకులు పాల్గొనటం జరిగింది.