‘మేరా యేషు యేషు’ వీడియోతో ప్రసిద్ధుడైన మతబోధకుడు బజీందర్ సింగ్ పంజాబ్ లో తన నెట్ వర్క్ ను వేగంగా విస్తరించుకుంటున్నాడు. అతని ఆధ్వర్యంలోని ‘ప్రాఫిట్ బజీందర్ సింగ్ మినిస్ట్రీస్ ‘ తన శాఖను ఇప్పుడు మోగాలో ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్, నటుడు సోనూసూద్.
బజీందర్ గతంలో అనేక వ్యాధులు నయం చేస్తానని అమాయకులెందరినో మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆ యాడ్ పైన మీమ్స్ కూడా బోలెడు వైరల్ అవుతున్నాయి.
అలాంటిది అతడు మోగాలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి సాక్షాత్తూ పంజాబ్ సీఎంతో పాటు సోనూసూద్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
ప్రొఫెట్ బజేందర్ సింగ్ మినిస్ట్రీస్ మెగాలో నవంబర్ 25న తమ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేస్తోందని నవంబర్ 24న ఓ వీడియో రిలీజైంది. యాడ్ లాగా ఉన్న ఆ వీడియోలో బజీందర్ చేసిన అద్భుతాలున్నాయి. కేన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులనుంచి తన ప్రార్థనతోనే ఎందరికో విముక్తి కలిగించాడన్నది వీడియో సారాంశం.
ఆ వీడియోలో అతిధుల వివరాలు స్పష్టంగా ఉన్నాయి. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ జోట్ కమల్, నటుడు సోనూ సూద్ తో పాటు…త్వరలోరాజకీయ ప్రవేశం చేయబోతున్న అతని సోదరి మాళవికా సూద్ పేర్లు, ఫొటోలున్నాయి. ఇంకా ఏ పార్టీలోనూ చేరకపోయినా….మాళవిక తన సొంతూరు ఉన్న మోగా నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇక అన్నీ అబద్ధాలు చెప్తూ, మోసపూరిత వాగ్దానాలు చేస్తూ కన్వర్షన్స్ కు పాల్పడుతున్న బజీందర్ సింగ్ పై హిందుత్వవాదులు విరుచుకుపడుతున్నారు ముందునుంచీ. ఇప్పుడిక వైరల్ అవుతున్న ఆహ్వానపత్రికను చూసి మరింత అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సీఎం ఏం చెబుతారని రచయిత రతన్ శారదా ప్రశ్నిస్తున్నారు. సిక్కు హిందువుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆర్ఎస్ఎస్ ను ద్వేషించే సుఖ్ బీర్ బాదల్, అకాళీదళ్ లు ఇప్పుడేం చెబుతారని, మతమార్పిళ్లపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రవక్త అయిన బజిందర్ కు చన్నీ శిష్యుడిగా మారాడా అని రతన్ శర్దా వ్యాఖ్యానించారు.
ఇన్ని రోగాలు నయం చేసిన బజిందర్ కరోనాను ఎందుకు నయం చేయలేదని..అతని కార్యక్రమానికి అతిధులుగా సీఎం, నటుడు సోనూసూద్ వెళ్లడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక సింగ్ మీద ఇంకా చాలా ఆరోపణలున్నాయి. హత్య , అత్యాచారం కేసులో అతను నిందితుడు. అంతేకాదు ‘miraculous healing’ సాకుతో ఎంతోమందిని దోచుకున్నాడు. మైనర్ ని బలవంతంగా మతం మారుస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఏడాది ఆగస్టులో బజిందర్ సింగ్ పై పోక్సో కేసు పెట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పంజాబ్ పోలీసులను ఆదేశించింది.
‘హీలర్ బాబా’ యూట్యూబ్ చానల్ కు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండే అతని ఫేస్ బుక్ పేజీని 2 లక్షలమంది ఫాలో అవుతున్నారు. అతని సోషల్ మీడియా పేజీల్లో హెచ్ఐవీ, పక్షవాతం వంటి వ్యాధులు నయం చేసినట్టున్నవే ఉంటాయి. అతను ప్రార్థన చేసిన తైలాన్ని పూస్తే మూగచెవిటి పిల్లలు మాట్లాడతారు, వింటారని ప్రచారం చేయిస్తుంటాడు. పంజాబ్ సర్కారు అండ, స్థానిక నాయకుల తోడ్పాడుతో బజీందర్ సింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక మోగాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం ద్వారా తన నెట్ వర్క్ ను, మతమార్పిళ్లను విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు బజీందర్.