హైదరాబాదులోని జియాగూడ పేరు చెప్తే ముందుగా గుర్తుకొని వచ్చేది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. వందల ఏళ్ల నాటి ఈ దేవాలయంలో స్వామి వారిని పూజిస్తే కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. ఈ పురాతన దేవాలయం లో ఇప్పటికీ పాత కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలతోనే శ్రద్ధగా పూజలు నిర్వహిస్తున్నారు. పూర్తి సంప్రదాయబద్ధంగా పూజలు చేయించే ప్రధాన అర్చకులు శ్రీమాన్ శృంగారం రాజగోపాల ఆచార్యులు భక్తులందరికీ బాగా ఆత్మీయులు.
దురదృష్టవశాత్తు శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ శృంగారం రాజగోపాల్ ఆచార్యులు కన్ను మూశారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 24న (బుధవారం) ఉదయం 11గంటలకు పురాణాపూల్ హిందూ స్మశాన వాటికలో జరగనున్నాయి. జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమై పురాణాపూర్ వరకు కొనసాగనున్నాయి. శతాధిక ప్రతిష్టాపక యజ్ఞాచార్యులు, అలంకార బట్టర్ శ్రీమాన్ శృంగారం రాజగోపాల్ ఆచార్యుల మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు అధికార, అనధికార ప్రముఖులతో పాటు వేద పండితులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శిస్తూ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జియాగూడ దేవాలయాన్ని దర్శించే భక్తులందరికీ ఆచార్యులు గారు బాగా తెలుసు. అందుచేత వేల సంఖ్యలో భక్తులు వచ్చి కడపటి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.