మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన వ్యక్తిగతఖర్చులకోసం వాడుకున్నారని…తండ్రిపేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని ఆమె మీద ఈడీ చేస్తున్న అభియోగం.
2020 – 2021 మధ్య స్వచ్ఛంద సేవా ప్రయోజనాల కోసం Ketto అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రూ. 2.69 కోట్లకు పైగా సేకరించినట్లు ఈడీ పేర్కొంది. అందులోంచి 50 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది.
ఇంతకీ ఈ రానా ఆయూబ్ ఎవరు..

Alleged journalist rana Ayyub
2002 గుజరాత్ అల్లర్లు చాలా మంది జర్నలిస్టులకు సువర్ణవకాశంగా మారాయి. ఆ అల్లర్లలో బాగా ప్రచారం చేసుకుని తమ కెరీర్లో బాగా ముందుకు దూసుకుపోయిన వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు రాణా అయూబ్. ఆమె గుజరాత్ అల్లర్ల వార్తలు కవర్ చేయడమే కాకుండా ఆ అల్లర్లు లో నూ, ఎన్ కౌంటర్ల లొనూ మోడీ, అమిత్ షా ల పాత్ర వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాసింది. ఆ పుస్తకం ఆధారంగా గుజరాత్ గొడవలపై మళ్ళీ విచారణ చేయాలి అని ఎవరో సుప్రీంకోర్టు లో కేస్ వేస్తే ఆధారాలు లేని ఊహాగానాలు, కల్పితాలు అని ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు తీసి పక్కన పడేసింది. అది ఆమె రాతలకున్న విశ్వసనీయత.
అయినా రోజుకి ఒక సారి అయిన ఈమెకు గుజరాత్ గొడవలు గుర్తు చేసుకుంటే కానీ నిద్ర పట్టదు రానా అండ్ కోకు. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని తిడుతూ వాషింగ్ టన్ పోస్ట్ మొదలగు విదేశీ మీడియాలో వ్యాసాలు రాస్తూ టివి చర్చలు లో పాల్గొంటూ లక్షలు గడిస్తూ పొట్ట పోషించుకుంటోంది.
ఈ మీడియా సర్వీసులు వల్ల సుమారు సం. కి. ₹90లక్షలకు పైగానే వస్తున్నాయి అని ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ లో ఆమె చూపెడుతోంది. అధికారికంగా సంపాదించుకుంటూ టాక్స్ కడుతోంది అది తప్పేంకాదు.
ఇప్పుడు జరిగిందేంటంటే…
2020 నుంచీ గత సం. కోవిద్ వచ్చిన వరకు ఈమె సమాజ సేవ చేయడానికి కెట్టో అనే క్రౌడ్ ఫండింగ్ పోర్టల్ ద్వారా మూడు సార్లు దేశ విదేశీ విరాళాలు సేకరించింది. ఈ కెట్టో పోర్టల్ ముందుగా డోనేషన్స్ సేకరిద్దాం అనుకుంటున్న వారి వద్ద నుంచి ఏ ఉద్దేశం కొరకు విరాళాలు సేకరిస్తున్నారనేది తెలియచేస్తూ ,సేకరణ కు అన్ని అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకున్నాం అని అండర్ టేకింగ్ ఇవ్వాలి. అందుకు ఆమె ఇలా ఇచ్చింది.
ఈ మూడు సార్లు దేనికోసం విరాళాలు సేకరించింది అంటే :
1. మురికివాడల్లో నివసించే వారికి, బీద రైతులకు సహాయం కోసం అని మార్చ్-ఏప్రిల్లో మధ్య ఫండ్స్ వసూలు చేసింది. దాదాపు 71 లక్షల రూపాయలు.
2. అస్సాం, బీహార్ మహారాష్ట్రలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికంటూ… 2020 జూన్-సెప్టెంబర్ మధ్య రెండో సారి ₹42 లక్షలువసూలు చేసింది.
3. చివరిగా మూడో సారి 2021లో వచ్చిన కోవిడ్ బాధితులను ఆదుకుందామంటూ… మే-జూన్ 2021 మధ్యలో ₹83 లక్షలు సేకరించింది. అంటే సుమారు ₹1.96 కోట్లు సేకరించింది. అంతే కాక డాలర్ల రూపంలో మరికొంత కలిపి మొత్తం ₹2.70 కోట్లు సేకరించింది.
అయితే…ఈ డబ్బులులో ఎంత సమాజ సేవకు వాడారో ఎంత స్వంతానికి వాడుకున్నారో తెలియదు.
ఇది అసలు ఎలా బయటకు తెలిసింది అంటే ఇలా విరాళాలు ఇవ్వండి అని గత కోవిద్ టైంలో కెట్టో లింకులు అవి పెడుతూ రాణా ట్వీట్స్ పెట్టింది. అదిచూసి ఆమె విశ్వసనీయత గురించి బాగా తెలిసిన ఓ వ్యక్తి ఆ కెట్టో కంపెనీకి వివరాలు కోరుతూ ఈమెయిల్ పెట్టాడు. ఆ కంపెనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా విదేశాల నుంచి విరాళాలు సేకరిస్తోందని తేలింది. తన సొంత పేరుమీద సొంతంకోసం సేకరిస్తోందని సదరు వ్యక్తి ఇన్కమ్ టాక్స్ వారికి, ఈడి కి ఫిర్యాదు చేశాడు. అంతే కాక ఇలా విరాళాల పేరుతో చీటింగ్ చేస్తున్నాది అని ఘజియబాద్ పోలీస్ స్టేషన్ లో FIR కూడా నమోదు చేశారు.
ఈ ఫిర్యాదు మీద ఈడి కెట్టో కంపనీ దగ్గర వివరాలు సేకరిస్తే మొత్తం ₹2.70 కోట్లు విరాళాలు సేకరించి దానిలో ₹1.25 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తేలింది. మాకు రాణా ఆయుబ్ ఆమె కుటుంబ సభ్యుల KYC వివరాలు సమర్పించిన తరువాత ఆమె డబ్బులు విత్ డ్రా చేయడానికి ఒప్పుకున్నాం అని కెట్టో కంపనీ చెప్పింది.ఈడీ వివరాలు అడిగితే రానా చెప్పిన మాట…₹40 లక్షలు మాత్రమే సమాజ సేవకు ఖర్చు చేసాను, పీఎం రిలీఫ్ ఫండ్ కి ₹74.50 కట్టాను, ₹1.05 కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టాను” అని .. విదీశీ నిధులు సేకరించలేదు అని అబద్దం చెప్పింది.
ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ డబ్బులు తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు మార్చింది. తన తండ్రి పేరు ₹50లక్షలకు మే 2020లో ఫిక్సడ్ డిపాజిట్ వేసింది. ఎందుకు అని అడిగితే భవిష్యత్ లో హాస్పిటల్ కడదాము అని ప్లాన్ చేస్తున్నాను చెప్పింది. కానీ కెట్టో కి ఇచ్చిన ఆగ్రిమెంట్ లో హాస్పిటల్ ప్రస్తావన లేదు. బీదలకు బియ్యం, పప్పులు,వంట నూనె, మందులకు ఖర్చు చేస్తాను అని మాత్రమే ఉంది.
ఐటీ వాళ్ళు మొత్తం బిల్లులు అవీ చెక్ చేసి మొత్తం సొమ్ములో 29 లక్షలు మాత్రమే సేవకు ఉపయోగించి మిగతా ₹2.40 కోట్లు నొక్కేసినందుకు ₹1.50 కోట్లు టాక్స్ కట్టాలి అని చెప్పారు.
ఈడి మొత్తం విచారణ చేసి మోసం ద్వారా విరాళాలు సేకరించి సొంత ఖాతాలో ఏడాదికి పైగా మొత్తాన్ని పెట్టుకున్న మోసం బయట పడ్డాక తప్పించుకోవడానికి పీఎం రిలీఫ్ ఫండ్ కి ₹74.50 లక్షలు డబ్బులు కట్టింది. దీంతో మనీలాండరింగ్ కేసు బుక్ చేసి … ఆమె తండ్రి ఖాతల్లో ఉన్న డబ్బులు తండ్రి పేరు మీద ఉన్న 50 లక్షలు ఫిక్సడ్ డిపాజిట్ జప్తు చేశారు.
దేశ వ్యతిరేక ప్రచారం లో ఫేక్స్ స్ప్రెడ్ చేస్తూ దొరికిపోవడం ఆమెకు అలవాటే.. 2021 జూన్ 15న జైశ్రీరాం అననందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపారంటూ ఆమె ట్వీట్లు చేశారు. విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ వ్యవహారంలో ది వైర్, రాణా అయ్యూబ్, సల్మాన్ నిజామీ, మక్సూర్ ఉస్మానీ, సమా మహ్మద్,సబా నఖ్వీ సహా పలువురిపై ఘజియాబాజ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెయిల్ నిరాకరించడంతో తనకు కడుపునొప్పని బాలేదనిగగ్గోలు పెడుతూ తెగనాటకాలాడింది ఈ రానా ఆయూబ్. రెండువర్గాల మధ్య విద్వేషం పెంచే స్టేట్ మెంటో ప్రభుత్వానికి వ్యతిరేక కామెంటో చేస్తూ ఉంటుంది. దీంతోఇక్కడి ఆమె మద్దతుదారులతో పాటు విదేశీ మీడియా కూడా ఆమెకు సపోర్టుగా రంగంలోకి దిగుతుంది. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తూ కాస్త పరుషపదజాలం వాటితే ఆ స్క్రీన్ షాట్ తీసి విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఎంతసేపూ అంతర్జాతీయంగా భారతదేశ పరువు తీసే చర్యలే. అసలు మరింకో పనేంలేదా అనిపిస్తుంది ఆమెను ఫాలో అయ్యేవాళ్లకు. రానా మాత్రమే కాదు ఇందాక పైన చెప్పిన ఆ గ్యాంగ్ మొత్తం నిద్రలేస్తే లేచేపని అదే. వాళ్ల ద్వేషం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోదీ మీద మాత్రమే అని ఇట్టే అర్థమవుతుంది.
ఇంకేం మోదీ మీద మీడియా మేధావుల ఏడ్పులు మొదలయ్యాయి.
ఈ సమయంలో మరొక సంఘ సేవకురాలు గుర్తుకు రావాలి. గుజరాత్ గొడవలలో పేరు బాగా సంపాదించి ఒక NGO స్థాపించి అల్లర్లలో నష్టపోయిన వారిని ఆదుకుంటాం అని 20 ఏళ్ల క్రితమే డబ్బులు నొక్కేసిన ఆవిడ పేరు తీస్తా సెతల్వాద్ .ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈమె సేకరించిన నిధులే కాక ఈ NGO కు యుపిఎ ప్రభుత్వం 1.40 కోట్లు నిధులు ఇచ్చింది కూడా.

journalist Teesta Setalvad
కొద్దీ నెలలు క్రిందట ఇలాగే పట్టుబడిన మరో దొంగ సాకేత్ గోఖలే.. ఈ గోఖలే మోడీ ప్రభుత్వ బండారం బయట పెట్టడానికి RTI ద్వారా సమాచార సేకరించడానికి మిగతా ఖర్చులకు అని చెప్పి మోడీ విరోధులు దగ్గర డబ్బులు సేకరించి ₹76 లక్షలు మింగేసాడు. లెక్కలు అడిగితేనే సొంతానికి జీతంలా వాడుకున్నాను అని చెప్పి వాళ్ళను బకరాలను చేసాడు. గతంలో ఇతను రాహుల్ కి జిగిని దోస్తీ, ఇప్పుడు మమత పార్టీలో జాయిన్ అయ్యాడు.

Saketh Gokhale with Rahul Gandhi
పూర్వం హాయిగా తమ రాజ పోషకురాలు సోనియా అధికారంలో వున్నప్పుడు ఫ్రీ విదేశీ ప్రయాణాలు, మందు పార్టీలు, బహుమతులు, పద్మశ్రీలు చవగ్గా ఇళ్ల స్థలాలు దొరుకుతూ హాయిగా NGO లు పెట్టుకుని ప్రజా సేవ చేస్తూ కోట్లు వెనకేసుకున్నా ఇటువంటి వారిని ఎవరూ ప్రశ్నించే వారు కాదు. ఏ ప్రభుత్వ అధికారి కి అయినా వీరి మీద వేలెత్తి చూపడానికి ఎన్ని గుండెలు?
మరి ఇప్పుడో ? ఈ నిరంకుశ మోడీ రాక్షస పాలన వీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మోడీని గద్దె దింపడానికి 2014 మే నెల నుండి 24 గంటలూ కష్టపడుతున్నారు పాపం.
తమ కడుపు కొడుతున్నాడు అని ఈ దొంగల ముఠామోదీని దింపడానికి ప్రయత్నిస్తున్నారు మరి ప్రయత్నించరా…
కానీ చదువుకున్న మేధావులు కూడా ఒక్క భావజల ద్వేషంతో మోడీ మీద ద్వేషంతో ఈ దొంగల ముఠాకు మద్దత్తు ఇవ్వడం దేశం చేసుకున్న దౌర్భాగ్యం. అయితే కేవలం రానా వంటి వారే కాదు తెలుగురాష్ట్రాల్లో అలాంటి జర్నలిస్టులు , లెఫ్ట్ మేధావులు కొందరు కరోనా సర్వీస్ పేరుతో విరాళాలు వసూలు చేసిన బొక్కేసిన ఘటనల్ని మనం చూశాం. వాళ్లకీ తెలుగు ఎన్నారైలు పెద్దమొత్తంలోనే విరాళాలు ఇచ్చారు. వారంతా రానా, తీస్తా, స్వరాభాస్కర్ వంటివారికి ఫుల్ మద్దతుదారులు. అయితే రానా ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక కోట్లల్లో వచ్చాయి వాటిని సొంతానికి వాడుకుంది. ఇక్కడివాళ్లు వేలు, లక్షల్లో మాత్రమే వెనకేసుకోగలిగారు. ఇదీ విషయం.