తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణె దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటన చేసిన రాణె దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఆమె ప్రకటనను నిరసిస్తూపెద్దసంఖ్యలో శివసేన కార్యకర్తలు వారింటిముందు నిరసనకు దిగారు. ఆ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మత ఘర్షణలు చెలరేగేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు ఆ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు వారిని రాజద్రోహం కింది కేసుపెట్టి అరెస్ట్ చేశారు. ఆ కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకుని దాడి చేశారన్న ఆరోపణలపై మరో కేసు నమోదైంది. అయితే రెండో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు రాణె దంపతులు. అయితే విచారణ జరిపిన కోర్టు పిటషన్ ను తిరస్కరించింది. అయితే రెండో ఎఫ్ఐఆర్ లో చర్యలు తీసుకునే 72 గంటలముందు మాత్రం వారికి నోటీసులు ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం నవనీత్, రాణా రెండువారాల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నవనీత్ ను బైకుల్లా మహిళా జైలుకు, రవిని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు పోలీసులు.