సేవకోసం సేకరించిన నిధులను తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలమిస్ట్ రానా ఆయూబ్ మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగాబుక్కైంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఆవుల స్మగ్లింగ్ ఘటనపై opindia ప్రచురించిన వార్తను అత్యుత్సాహంతో పోస్టు చేసి దొరికిపోయింది. ఇక ఆమె మద్దతుదారులైతే మరింత రెచ్చిపోయి నవ్వులపాలయ్యారు.
మే 12న ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న జీషాన్. సద్దాం , ఖాసీమ్ లను పోలీసులు ఎలా పట్టుకున్నదీ వివరిస్తూ ఆ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. అసలైతే పోలీసులు వెంబడిస్తున్న వారి వాహనం ఓ చెట్టును ఢీకొంది. లొంగిపోవాలని పోలీసులు కోరగా నిందితులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు స్మగ్లర్లు గాయపడ్డారు. అందులోనుంచి ఆవు సురక్షితంగా బయటపడింది.
https://twitter.com/RanaAyyub/status/1524666098066804736?s=20&t=uk2PeFxjdW9mnoUWUmQaWw
OpIndia అదే వార్తను ట్విట్టర్ హ్యాండిల్లో “ఘజియాబాద్: పశువుల స్మగ్లర్లు జీషాన్, సద్దాం సహా ఖాసీమ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆవులను రక్షించారు ” అనే హెడ్డింగ్ తో వార్తను షేర్ చేశారు. ఆ వార్త ను ఉద్దేశించి ఇస్లామిస్ట్ జర్నలిస్ట్, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రానా అయ్యూబ్ OpIndia ట్వీట్ స్క్రీన్షాట్ను మెన్షన్ చేస్తూ… ఓ రైట్ వింగ్ వెబ్ సైట్ వార్తలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ పోస్ట్ చేసింది. అందులో షాట్ అని ఉంటే షాట్ డెడ్ అనే పదాన్ని వాడింది. ఆ నివేదికలో కూడా పోలీసులు, నిందితుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు స్మగ్లర్లు గాయపడ్డారని మొదటిపేరాలోనే స్పష్టంగా ఉంది. కానీ హెడ్డింగ్ ను మాత్రమే చూసి, మొత్తం వార్తను చదవకుండా హెడ్డింగ్ లో పేర్కొన్న ‘షాట్’ పదాన్ని ‘షాట్ డెడ్’ అని అర్థం చేసుకుని తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నించింది రానా.
అయితే ఆమె అలా ట్వీట్ చేసిందో లేదో వామపక్ష ఉదావరవాదులు, ఇస్లామిస్టులు విక్టిమ్ కార్డు ప్లేచేయడం మొదలుపెట్టారు. భారతీయ ముస్లింలపట్లవిచారం వ్యక్తం చేస్తూ.. వారు నిరంతరం హింసకు గురవుతున్నారని..అసలు మోదీ హయాంలోనే పశువుల రక్షణ పేరిట ముస్లింలను వేధిస్తున్నారని ట్వీట్లు చేశారు. ఓ నెటిజనైతే ఏకంగా హంతకులు, రేపిస్టుల పట్ల అధికారులు మరింత సానుభూతితో ఉన్నారని…కానీ స్మగ్లర్లంటూ చంపేశారనీ ట్వీట్ చేశారు. అయితే వాళ్లెవరూ కనీసం ఆ కథనాన్ని కనీసం చదివే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కేవలం జర్నలిస్ట్ రానా చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను గుడ్డిగా నమ్మి అత్యుత్సాహం ప్రదర్శించి ఎప్పటిలాగే నవ్వుల పాలయ్యారు.