టెర్రరిస్టులకు మద్దతిస్తూ, నిరంతరం హిందువులను ద్వేషిస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే జర్నలిస్టు రానా ఆయూబ్ ఈసారి సౌదీ నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతునిస్తూ… అవకాశం దొరికినప్పుడల్లా సొంతదేశం, ప్రభుత్వాలపైనే విషం చిమ్ముతూ నెటిజన్లతో భయంకరమైన తిట్లు తినే రాణా ఆయూబ్ ఈసారి సౌదీ జాతీయులకు టార్గెట్ అయ్యారు. సౌదీని రక్తపిపాసిగా వర్ణిస్తూ ఆమె తాజాగా చేసిన ట్వీట్ పై మండిపడుతున్నారు ఆదేశ నెటిజన్లు. మొన్న డ్రోన్ దాడుల నేపథ్యంలో యెమన్ మీద సౌదీ అరేబియా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
సౌదీ సైనిక ఆపరేషన్ పై స్పందిస్తూ రాణా…
https://twitter.com/RanaAyyub/status/1484927027946098689?s=20
‘Yemen is bleeding and there is nobody to stop the bloodthirsty Saudis. These are people who call themselves the custodians of Islam. As a Muslim I am ashamed that these savages are guardians of the holy mosque. The world CANNOT stay silent thru this genocide ‘..అంటే రక్తపిపాసి సౌదీ దాష్టీకానికి యెమన్ రక్తమోడుతోంది. వారు తమను తాము ఇస్లాం సంరక్షకులుగా చెప్పుకుంటారు. కానీ వీళ్ల క్రూరత్వాన్ని చూసి ఒక ముస్లింగా నేను సిగ్గుపడుతున్నా. ఈ మారణహోమాన్ని చూస్తూ ప్రపంచం మౌనంగా ఉండకూడదు అంటూ ట్వీట్ చేసింది.
యెమన్ లో హౌతీ తిరుగుబాటుదారుల స్థావరంపై సౌదీ వైమానిక దాడులు చేసిన తరువాత రాణా ఈ వ్యాఖ్యలు చేసారు. సౌదీఅరేబియా కూటమిలో ముఖ్య భాగస్వామ్య దేశమైన యూఏఈపై హౌతీలు డ్రోన్ దాడి చేయడంతో అక్కడ మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. హౌతీ తిరుగుబాటులు కొంతకాలంగా సౌదీఅరేబియాపై డ్రోన్, క్షిపణిదాడులు చేస్తూ వస్తున్నారు. ఉత్తర యెమన్లోని చాలా భూభాగం ఇప్పుడు హౌతీల నియంత్రణలో ఉంది. యెమన్లో హౌతీలు రెచ్చిపోతుంటే భారతీయ జర్నలిస్టు వాళ్లకి మద్దనివ్వడం సౌదీ పౌరుల్ని నివ్వెరపరిచింది.
యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి విమానాశ్రయంపై నాలుగు రోజుల కిందట హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేపట్టాయి. ఈ నేపథ్యంలో హౌతీ తిరుగుబాటు దారులకు మద్దతుగా రానా ఆయూబ్ ట్వీట్ చేసిన వెంటనే అనేకమంది సౌదీ నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.
యెమెన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్న ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూపునకు ఆయూబ్ మద్దతివ్వడమేంటని మండిపడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. సౌదీకి చెందిన ఇంజినీర్ గస్సన్ ఫేక్స్ న్యూస్ రానా ఉగ్రవాదులకు మద్దతునిస్తుండడం ఆశ్చర్యమేం కలిగించడం లేదన్నారు. యెమెన్ అభ్యర్థన మేరకే పదిదేశాల కూటమిలో ఒకటైన ఆ దేశంలో సౌదీ అరేబియా సైనిక చర్య ప్రారంభించిందని గుర్తు చేశారు. మేం అక్కడ శాంతికోసం సైనిక చర్యకు మద్దతిస్తుంటే రానా ఉగ్రవాదులకు మద్దతిస్తోందని మండిపడ్డారు.
మరో ట్విట్టర్ యూజర్ అబూ సుల్తాన్ పూర్తిగా బూతులతో విరుచుకుపడ్డారు. రానా అబద్దాల కోరు అని ఆమె చెప్పిందంటా బుల్షిట్ అంటూ ఫైరయ్యారు. ఆమెది తెలివితక్కువ ట్వీట్ అని అందుకే రిప్లై ఆప్షన్ డిసేబుల్ చేసిందనీ అన్నారు.
https://twitter.com/gassan_z/status/1485215126370328580?s=20
https://twitter.com/Abu_Sultan_KSA_/status/1485137171115872257?s=20
పిల్లల్ని సైనికులుగా వాడుకుంటూ యెమన్లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్న హౌతీ టెర్రరిస్టులకు మద్దతిస్తున్న ఈ జర్నలిస్టులో ఓ కపటి ఉందని మరో సౌదీ నెటిజన్ ట్వీట్ చేశారు. హౌతీల నిరంకుశ పాలనను అంతం చేయడానికి సౌదీ కృషిచేస్తుంటే… రానా ఆ ఉగ్రగ్రూపుకు మద్దతిస్తోందన్నారు.
https://twitter.com/mamba_aka/status/1485256405678538760?s=20
పిల్లల్ని కూడా ఉగ్రవాదులుగా తయారుచేస్తూ వాళ్లను చంపుతూ ..యెమన్లో కల్లోలంరేపుతూ కూటమి దేశాలపై దాడులకు తెగబడుతున్నహౌతీలకు రానా మద్దతివ్వడం సిగ్గుచేటని గ్రీస్ కు చెందిన మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. అంటే యెమన్ లగురించి పట్టించుకోరు కానీ..ఉగ్రవాదులపక్షం నిలుస్తారా ఇంతకన్నాఅసహ్యం మరోటి ఉండదని ట్వీట్ చేశారు.
అబుదాబీలో దాడి తమ పనేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. హూతీ తిరుగుబాటుదారులు.. యెమెన్ ప్రభుత్వం మీద, సౌదీ సారథ్యంలోని సంకీర్ణకూటమిపై చాలాకాలంగా పోరాడుతున్నారు. 2015లో హూతీల దాడులతోనే యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రాబ్బు మన్సూర్ హాదీ దేశం విడిచివెళ్లారు. యెమెన్ కు మద్దతిస్తున్న సౌదీ అరేబియా… యూఏఈ, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలతో కలిసి హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతోంది.
మొన్నటి డ్రోన్ దాడి మృతుల్లో ఇద్దరు భారతీయులున్నారు. అమాయక భారతీయులు చనిపోయినప్పుడు మౌనంగా ఉన్న రానా… ఇప్పుడు ఉగ్రస్థావరంపై సౌదీ దాడిచేస్తే వాళ్లకు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రానాకిది కొత్తేం కాదు. టెర్రరిస్టులకు ఆమె బహిరంగంగానే మద్దతిస్తుంటారు. మొన్నటికిమొన్న బంగ్లాదేశ్ లో హిందువుల ఆలయాలు, హిందువులపై దాడులు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు. అందుకే రానా హౌతీలకు మద్దతిస్తూ చేసిన ట్వీట్ పై సౌదీ పౌరులే కాదు భారత నెటిజన్లూ మండిపడుతున్నారు.