సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రాంపూర్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.శిక్షపడితే కనుక ఆజంఖాన్ తన శాసనసభ్యత్వాన్ని కోల్పోతారు.
ఇదొక్కటే కాదు ఆజంఖాన్పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి.తాజాకేసు 2019 నాటిది. ఓ సభలో ఆజంఖాన్ ముఖ్యమంత్రి యోగిమీద, నాటి కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజంఖాన్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మొదట్లో విడుదలయ్యారు.
https://twitter.com/ANINewsUP/status/1585554664719716352?s=20&t=3vwKpoKgYbupXa6P2DIIWw