పంజాబ్ ఖలిస్తానీ మూమెంట్ ను వ్యతిరేకిస్తున్న రమ్నిక్ సింగ్ వివరాలు కోరుతూ పంజాబ్ పోలీసులు ట్విట్టర్ కు లేఖరాశారు. ఖలిస్తాన్ ఒక విఫలమైన పాకిస్తానీ ప్రాజెక్ట్ అని.. పంజాబ్లోని సిక్కులు ఎవరూ దీనికి మద్దతు ఇవ్వడం లేదని పదేపదే ప్రచారం చేస్తుంటారు రమ్నిక్. అయితే గతనెల 20న డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా, ఆమె స్నేహితురాలికి మధ్య జరిగిన సంభాషణను మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినందుకు ఈ వివరాలు అడిగారు పంజాబ్ పోలీసులు. పంజాబ్లోని రూప్నగర్ జిల్లాలో ఉన్న నూర్పూర్ బేడీ పోలీస్ స్టేషన్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 91 కింద ట్విట్టర్కు నోటీసులు జారీ అయ్యాయి. రమ్నిక్ కు సంబందించిన Twitter ID పూర్తి IP లాగిన్ ల వివరాలను ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇవ్వాలని, మొబైల్ నంబర్ను అందించాలని కోరింది. ఈ నోటీసును పాటించాలని, దీనికి సంబంధించి నివేదికను పంపాలని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ను పోలీసులు ఆదేశించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 20న, రాజకీయ విశ్లేషకుడు రమ్నిక్ సింగ్ మాన్.. సునీతా కేజ్రీవాల్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగిన సంభాషణను అప్లోడ్ చేశారు, అందులో ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా చండీగఢ్లో బంగ్లాను కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పారు.
“రాఘవ్ జీ ఇప్పుడు చండీగఢ్లోని సెక్షన్ 8లో బంగ్లాని కొనుగోలు చేశాడు. అక్కడి వాతావరణం బాగుంటుంది. చూద్దాం.మార్చి 10, 2022న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి’’ అని సునీతా కేజ్రీవాల్ చెప్పినట్లు ఉంది.
https://twitter.com/ramnikmann/status/1495263756816814086?s=20&t=rtx7wgbBJrdafvqoanldeg
ఆడియో క్లిప్ ను పోస్టు చేస్తూ “రాఘవ్ చద్దా, మీరు ఎంత డబ్బు వసూలు చేసారు? చండీగఢ్లోని సెక్టార్ 8లో బంగ్లా కొన్నారా? నేను 24 ఏళ్లుగా కష్టపడుతున్నాను, కానీ కొనలేకపోయాను. #CURRUPTION అంటూ వ్యాఖ్యచేశారు రమ్నిక్. అయితే ఫేక్ ఆడియో క్లిప్ ప్రసారం చేశారనే ఆరోపణలపై వెంటనే వెంటనే నూర్పూర్ బేడి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది.సైంటిస్ట్ ఆనంద్ రంగనాథన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
https://twitter.com/ramnikmann/status/1523673158737604609?s=20&t=b0dyd26nPmiGWJbqZrX9ew