తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 142 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) పథకం కింద ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం కోసం 23 రాష్ట్రాలలోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు 50 సంవత్సరాల కాలవ్యవధితో వడ్డీరహిత రుణాలు అందించడం జరుగుతుంది. తద్వారా, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది. సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుంది.
ఇందులో తెలంగాణ నుంచి రెండు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మొదటి ది.. సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ (సుస్థిర పర్యాటక సర్క్యూట్స్) కింద రూ. 74 కోట్లతో రామప్ప ప్రాంతం..
ఇక రెండోది,, వెల్ నెస్ & స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల కింద రూ. 68 కోట్లతో సోమశిల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశం యొక్క సహజమైన సాంస్కృతిక మరియు చారిత్రక వైభవాన్ని అనుభూతి చెందాలనుకునే ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టడం జరుగుతుంది.
తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని ప్రజలకు, భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణకు నిధులను కేటాయించుతున్నారు.