కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీసాగింది. సమితి అధ్యక్షుడు పోల్సాని సుగుణాకర్ రావు నేతృత్వంలో జగిత్యాల లోని ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయం నుంచి ర్యాలీ మొదలైంది. అక్కడినుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. సుగుణాకర్ రావుతో పాటు పెద్దసంఖ్యలో యువత, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)