ఏటూరునాగారంలో దళిత గిరిజన ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్పృహతప్పి పడిపోయారు. యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కాసేపటికే నీరసంతో బీపీ తగ్గి అక్కడే కళ్లుతిరిగిపడిపోయారు.అక్కడే ఆమెకు వైద్యులు చికిత్స అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.