తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్. తమకు దక్కబోయే రెండు స్థానాలతో పాటు బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన మరో స్థానానికి కలిపి మొత్తం ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేసింది. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ఖరారు చేశారు సీఎం. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాశ్ స్థానాలు ఖాళీఅయ్యాయి. అయితే బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంది. టీఆర్ఎస్కు మొదటి నుంచి సానుభూతిపరుడుగా ఉన్న పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు పంపాలని కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించారని చెబుతున్నారు. ఇక దామోదర్ రావు కూడా పార్టీ ఆవిర్భావంనుంచీ కేసీఆర్ తోనే ఉంటూవచ్చారు.