మౌలిక సదుపాయాల కల్పనతో సరిహద్దులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిఘా సామర్థ్యాన్నీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కొత్తగా నిర్మించిన 3 రోడ్లు, 24 వంతెనలను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇటీవల నార్తర్న్ సెక్టర్లో శత్రువును ఎదుర్కొనవలసి వచ్చిందని చైనా చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించారు. శత్రువును దృఢ నిశ్చయంతో ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. సరిహద్దు ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని… ఆ ప్రాంతాల అభివృద్ధికి సహకరించే బీఆర్ఓ మనకు గర్వకారణమని రాజ్ నాథ్ అన్నారు.
వీటిని రూ.2,245 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కొత్త రోడ్లలో చాలా ముఖ్యమైనది తూర్పు లడఖ్లోని చిసుమ్లే-దెమ్చోక్ రోడ్డు. సుమారు 19 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.
సైన్యం వేగంగా ప్రయాణించడానికి, పర్యాటకుల కోసం కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికుల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన వంతెనల్లో ఐదు లడఖ్లో, తొమ్మిది జమ్మూ-కశ్మీరులో, మూడు ఉత్తరాఖండ్లో, ఐదు హిమాచల్ ప్రదేశ్లో, ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో, ఒకటి సిక్కింలో ఉన్నాయి.