కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ప్రతీ ప్రసంగంలో వ్యాపార దిగ్గజాలైన అంబానీలు, ఆదానీలను లక్ష్యంగా చేసుకుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశసంపదనంతా ఆ ఇద్దరికీ దోచిపెడుతోందని మండిపడుతుంటారు. ఇటీవల రాజస్థాన్ లో నిర్వహించిన సభల్లోనూ ఆ ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ విరుచుకుపడ్డారు రాహుల్. అయితే రాహుల్ కు భిన్నంగా వ్యవహరిస్తోంది రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్కారు. సోలార్ పార్క్ నిర్మించేందుకు అదానీ గ్రూపునకు 1,600 హెక్టార్ల భూమిని లీజుకిచ్చింది.
దేశాన్ని రెండు-మూడు కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నాయని రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో చాలాసార్లు చెప్పారు. ఇటీవల, జైపూర్లో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ..“విమానాశ్రయాలు, బొగ్గు గనులు, సూపర్ మార్కెట్లు, ఎక్కడ చూసినా ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. అదానీ జీ మరియు అంబానీ జీ.” అన్నారు. కానీ రాష్ట్రప్రభుత్వ భారీ ప్రాజెక్టుకోసం ఆదానీ గ్రూపునకు అంతపెద్దంలో భూమి కేటాయించడంతో రాహుల్ గాంధీ లక్ష్యంగా విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక సోషల్మీడియాలో అయితే కాంగ్రెస్ పార్టీని, రాహుల్ ద్వంద్వ వైఖరిని నిలదీస్తూ ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర యూజర్ అంకుర్ సింగ్… “రాహుల్ గాంధీ రాజస్థాన్లో మోడీ ప్రభుత్వంపై దాడి చేశారు, ఇది అదానీకి భూమిని ఇస్తుంది. బుధవారం, రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి 1600 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఎందుకు? అని ప్రశ్నిస్తూ
ట్వీట్ చేశారు. మరో ట్విటర్ యూజర్ రిషి బాగ్రీ “డియర్ హేటర్స్, రాజస్థాన్లోని మీ ఫేవరెట్ కాంగ్రెస్ ప్రభుత్వం 1500 మెగావాట్ల సోలార్ పార్క్ నిర్మించడానికి అదానీకి 1600 హెక్టార్ల భూమిని చాలా రాయితీతో ఇచ్చింది.”
“రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 1600 హెక్టార్ల భూమిని అదానీ గ్రూప్కు ఇచ్చింది. రాహుల్ బాబా సొంత వాళ్లు అదానీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఆయన మాట ఎందుకు వినరు?అని అరుణాక్ష్ భండారీ వ్యాఖ్యానించారు.
డిసెంబరు 15న గెహ్లాట్ మంత్రివర్గం సమావేశమై 1,500 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు 1,600 హెక్టార్ల భూమిని అదానీ గ్రూప్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం సోలార్ పార్క్ కోసం జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి.
భీంసార్, మాధోపూర్, సదరసర్ గ్రామాల్లో 1324.14 హెక్టార్లు, బటయాడు, నెడన్ గ్రామాల్లో 276.86 హెక్టార్లలో సోలార్ పార్కుకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అదే సమయంలో, అదానీ గ్రూప్ 30 మెగావాట్ల పవన-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేరళలోని జైసల్మేర్ గ్రామంలో 64.38 హెక్టార్ల ప్రభుత్వ భూమిని లీజుకు పొందనుంది.
ఇక ఇటీవలే ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని రాష్ట్ర సచివాలయం ‘నబానా’లో గౌతమ్ అదానీని కలిశారు. పశ్చిమ బెంగాల్లో పెట్టుబడులపై ఇరువురు చర్చించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కు ఆదానీ హాజరుకానున్నారు. మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని మమతా కూడా పలుమార్లు విరుచుకుపడ్డారు.
Congress government in Rajasthan has given 1600 hectares of land to adani group to set up five solar projects in State.
Rahul baba own people are supporting adani 😂😂😂😂
Why @INCIndia leaders don't listen to him?
— AB (@iamAB1175) December 16, 2021
Dear Haters,
Your Favourite Congress government in Rajasthan just gave Adani a 1600 hectares of land at a very subsidized rate to build a 1500 MW solar park.— Rishi Bagree (@rishibagree) December 16, 2021
Rahul Gandhi did rally in Rajasthan attacking Modi Govt, saying it gives land to Adani.
On Wednesday, Congress govt in Rajasthan alloted 1600 hectare land to Adani.
Why @ashokgehlot51?
— Ankur Singh (@iAnkurSingh) December 15, 2021