సాధారణంగా చాలా మంది రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ మరియు కోపరేటివ్ బ్యాంకులు నుండి చవక వడ్డీ రేట్ తో రుణాలు తీసుకుంటూ వుంటారు. కొందరు రైతులు రుణాలు అంటే భయం చేత లేక ఇతర కారణాల వల్ల అప్పులకు పోరు. కానీ ఇలా రుణ మాఫీలు ప్రకటించిప్పుడు పాపం ఈ అప్పులు తీసుకోవడం అలవాటు లేని రైతులు నష్టపోతూ వుంటారు. అందుకని ఈ రుణ మాఫీ వాగ్దానాలు రాజకీయ పార్టీలు మొదలు పెట్టిన దగ్గర నుండి అప్పులు తీసుకునే అలవాటు లేని రైతులు కూడా అప్పులు తీసుకునే అలవాటు పెరిగింది. డబ్బులు అవసరం ఎవరికి ఉండదు? ఆ తీసుకున్న రుణ మొత్తం వ్యవసాయం మీద పెడితే ఆదాయం వచ్చి అప్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది. వేరే వాటి మీద ఖర్చు పెడితే ఆదాయాలు రాక ఆ డబ్బులు ఖర్చు అయిపోయి అప్పు మాత్రం మిగులుతుంది.
ఆ రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చి అందరి రైతుల మొత్తము రుణ మాఫీ చెస్తే ఫరవాలేదు. కానీ అలా అందరికి చెయ్యడానికి డబ్బులు సరిపోవు కాబట్టి ఏవో మెలికలు పెట్టి కొంత మందికి మాఫీ చేసి కొంత మందికి మొండి చేయి చూపిస్తారు.. రుణ మాఫీ వస్తుందనే ఆశతో సకాలంలో అప్పు కట్టకపోవడం వల్ల వడ్డీలు, అపరాధ వడ్డీలుతో ఆ అప్పు అలా పెరిగిపోతూ ఉంటుంది.
మేం అధికారంలోకి వస్తే రైతుల రుణాలు అన్ని పది రోజుల్లో మాఫీ చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసారు.
కానీ తీరా అధికారంలోకి వచ్చాక అబ్బే ఒక్క కోపరేటివ్ బ్యాంకుల్లో అదీ ఒక్కో రైతుకు ₹20 వేలు మించకుండా మాఫీ అమలు చేస్తాం అని చెప్పింది.
మాఫీ వస్తుంది అని ఎదురు చూస్తూ రైతులు తమకు వచ్చిన పంట డబ్బులు కూడా రుణాలకు కట్టకుండా వేరే అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు కట్టమని రైతుల పీకలు మీద కూర్చుని పొలాలు జప్తు చేస్తామని అంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు వద్దు అని బ్యాంకుల్ని కోరుతోంది. మేం రైతులను అప్పులు కట్టమంటే ప్రభుత్వం కడుతుంది అని చెప్పి ఇన్నాళ్ళూ కట్టలేదు. ప్రభుత్వం ఆ అప్పులు కడితే మా చర్యలు ఉపసంహరించుకుంటాం లేదా మా రూల్స్ ప్రకారం ముందుకు పోతాం అని బ్యాంకులు చెపుతున్నాయి.
మొత్తం 1.35 లక్షల మంది రైతులు అప్పు కట్టవలసింది సుమారు 3000 కోట్లు.
రైతులు అంటే మాకు గౌరవం, మోడీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతోంది అని ఢిల్లీ ధర్నా రైతులకు మద్దత్తు ఇచ్చిన కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు, తికాయట్ లు యోగేంద్ర యాదవ్ లు ఈ విషయంలో పూర్తి మౌనం వహిస్తున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ ఇబ్బంది నుండి తప్పించుకోవడానికి కేంద్రం దేశంలో రైతులు అందరి రుణాలు మాఫీ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు వన్ టైం సెటైల్మెంట్ క్రింద బ్యాంకులు కొంత మాఫీ చేస్తే మేం కొంత కడతాం అని కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ చెపుతున్నారు.
ఈ రుణమాఫీ వాగ్దానాలకు ఒక పద్ధతి లేక పోతే అటు బ్యాంకులు ఇటు రైతులు ఇద్దరూ నష్టపోతారు.
Courtesy :- Chada Shastry