ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ వేటువేసింది. ఆ వ్యాఖ్యలపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ ఆదేశించింది. ఎందుకు చర్య తీసుకోకూడదో సెప్టెంబర్ 2 లోగా సమాధానం చెప్పాలంది.
పార్టీ వైఖరికి విరుద్ధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని… సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ అన్నారు .
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎమ్మెల్యే వీడియోపై మజ్లిస్ నేతలు, మైనార్టీలు.. అర్ధరాత్రి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల విజ్ఞప్తితో యూట్యూబ్ వీడియోలను రాజాసింగ్ తొలగించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.