రాజ్ ఠాక్రే తగ్గేదేలే అంటున్నాడు.మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపుపై పోరాటం ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు రాజ్. అప్పట్లో లౌడ్ స్పీకర్లపై బాల్ ఠాక్రే ఏమన్నారో చెప్పే వీడియోను షేర్ చేశారు. మహారాష్ట్రలోని మసీదులపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన డెడ్ లైన్ మంగళవారంతో ముగిసింది. లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే కనుక మే 4నుంచి అన్ని మసీదుల బయట హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరికా చేశారు. ఈ సందర్భంగానే బాల్ ఠాక్రే వీడియో షేర్ చేస్తూ వైరల్ చేస్తోంది మహానవనిర్మాణ సేన.
https://twitter.com/RajThackeray/status/1521694002197975040?t=O3Ux4N0RpiRbAaUhPunEYA&s=08
”మహారాష్ట్రలో నమాజ్ ప్రార్థనలు ఆపేంత వరకూ విశ్రమించేది లేదు. మతం అనేది దేశ ప్రగతికి అవరోధం కాకూడదు. మతాన్ని ఒక న్యూసెన్స్ గా ప్రజలు భావించకూడదు. హిందూ మతం కూడా ఎవరికైనా న్యూసెన్స్ అనిపిస్తే నాకు చెప్పండి.అంతేకాదు మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తప్పనిసరిగా తొలగించాలి” అని బాల్థాకరే మరాఠీలో మాట్లాడారు ఆ వీడియోలో .