రాష్ట్రపతి భవన్ నుంచి…ఇండియాగేట్ వరకు రాజ్ పథ్ పేరుతో ఉన్న మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. మరింత అందంగా ఆ మార్గాన్ని ఈనెల 8న సాయంత్రం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. న్యూడిల్లీ నగర పాలక సంస్థ ఈమేరకు రేపు ప్రత్యేకంగా సమావేశమై..పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆమార్గాన్ని బ్రిటీష్ పాలనాకాలంలో కింగ్స్ వేగా పిలిచేవారు. తరువాత దాన్నే హిందీలోకి మార్చి రాజ్ పథ్ గా పిలవసాగారు. అయితే వలసపాలనకు సంబంధించిన గుర్తులను చెరిపేయాల్సిన అవసరం ఉందని ఈమధ్యే స్పష్టం చేసిన మోదీ ఆ పనిలో పడ్డారు. ఇండియన్ నెవీ చిహ్నంలోని క్రాస్ ను తొలగించి శివాజీ స్ఫూర్తిని కలిగించే ముద్రతో నూతన చిహ్నాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.