ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. CBIకానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించ లేవని అన్నారు. నిరంతర లోపభూయిష్ట విధానాల కారణంగా రైలు ప్రయాణాల్లో ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ఈ విషయాని మీరు గానీ, రైల్వేమంత్రి కానీ అంగీకరించడం లేదని అన్నారు.
రైళ్లు ఢీకొనకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రక్షా కవచ్ను ఎందుకు అన్ని లైన్లలో అందుబాటులోకి తేలేదని ప్రశ్నించారు. రక్షా కవచ్ను కొంకణ్ రైల్వే అభివృద్ధి పరచిందని, రైసెర్చ్ డిజైన్స్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) 2011లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం…
ఆ పథకానికి ‘కవచ్’ అని 2020లో పేరు మార్చిందని..దాన్ని సరికొత్త ఇన్వెన్షన్ గా కేంద్రమంత్రి చెప్పడం విడ్డూరమని అన్నారు. ఇండియన్ రైల్వే రూట్లలో కేవలం 4 శాతం రూట్లలో మాత్రమే కవచ్ ఏర్పాటు ఎందుకు పరిమితమైందని లేఖలో ఆయన నిలదీశారు. బాలాసోర్ ఘటనలు పునరావృతం కాకుండా చూడటం వంటి చర్యలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానికి ఖర్గే సూచించారు.
https://twitter.com/kharge/status/1665600615609761792?s=20