ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోబాలాసోర్లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన నాటి నుంచి అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ధరించిన పట్టాలపై ఓ గూడ్సురైలుకు పచ్చజెండా ఊపారు. పునరుద్దరించిన ట్రాక్పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ సమయంలో రైల్వే మంత్రి ప్రార్థిస్తున్న దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారతీయ రైల్వే చరిత్రలోనే ఒడిషా ప్రమాదం పెను దుర్ఘటనగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో 278మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యిమంది గాయపడ్డారు.
https://twitter.com/AshwiniVaishnaw/status/1665430952217309185?s=20