ఫిబ్రవరి 10న రాహుల్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆ ట్వీట్ పై అసోంలో వెయ్యి దేశద్రోహం కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది. భారతదేశం గురించి మాట్లాడుతూ రాష్ట్రాల యూనియన్ ఎలా ఉందో చెబుతూ… ఈశాన్య రాష్ట్రాలను ఆయన ప్రస్తావించలేదు. గుజరాత్ నుంచి పశ్చిమబెంగాల్ వరకు కశ్మీర్ నుంచి కేరళ వరకు ఉందని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈశాన్య రాష్ట్రాలను భారత్ లో లేవని రాహుల్ అనుకుంటున్నారా అని అసోం వాసులు మండిపడుతున్నారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలే లేవన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ పెద్దపై కనీసం వెయ్యి దేశద్రోహ కేసులు పెడతామని వారంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా ఓ వైపు వాదిస్తున్న నేపథ్యంలో వారి వాదనను రాహుల్ సమర్థిస్తున్నారా.. ఈశాన్య రాష్ట్రాలు ఏడింటిని చైనాకు రాసిస్తారా అని నిలదీస్తున్నారు.
ఫిబ్రవరి 10న చేసిన ట్వీట్లో “మా యూనియన్లో బలం ఉంది. మాది యూనియన్ ఆఫ్ డైవర్సిటీ. అనేక భాషలు, సంస్కృతుల నిలయం మా యూనియన్. మా యూనియన్ ఆఫ్ పీపుల్.. మా యూనియన్ ఆఫ్ స్టేట్స్.. కశ్మీర్ నుంచి కేరళ వరకు. గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు వర్ణరంజితంగా ఉంది. ఈ దేశ స్ఫూర్తిని అవమానించకండి అని రాహుల్ ట్వీట్ చేశారు.
రాహుల్ ట్వీట్ పై త్రిపుర సీఎం విప్లవ్ కుమార్, అసోం సీఎం హిమంత శర్మ, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆరోజే తప్పుపట్టారు. వాయనాడ్ ఎంపీ ఉద్దేశపూర్వకంగా ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావించలేదని మండిపడ్డారు. అంటే చైనా డిమాండ్ ను రాహుల్ అంగీకరిస్తున్నట్టేనా అని నిలదీశారు. “భారత్ మేం గర్వించదగిన దేశం. నీ తుక్డే తుక్డే తత్వానికి భారత్ను తాకట్టు పెట్టలేం. దేశం, జాతీయతల్లో మీ సమస్య ఏంటి…మేం బెంగాల్ దాటి ఈశాన్యంలో ఉన్నాం అంటూ అప్పుడే గట్టిగా నిలదీస్తూ బదులిచ్చారు.
త్రిపుర సీఎం విప్లవ్ అయితే తనదైన శైలిలో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ మన సుందరమైన ఈశాన్యభారతాన్ని మర్చిపోయారు. తన ముత్తాతలా మినహాయించాడు. మేం కూడా భారత్ లో భాగమే. ఈశాన్యం ఇలా అవడానికి కారణం మీ అజ్ఞానమే అని మండిపడ్డారు.
అసలు రాహుల్ కు ఈశాన్య ప్రాంతం గురించి నిజంగానే అవగాహన లేదా అని మణిపూర్ సీఎం సింగ్ ప్రశ్నించారు. మణిపూర్ ఉనికినే గుర్తించని మీరు ఓట్లెలా అడుగుతారని అన్నారు. దేశాన్ని విభజిస్తోంది మీరు కాదా అని నిలదీశారు.
ఇంకా బీజేపీ ముఖ్యనేతలంతా రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలను రాహుల్ విస్మరించడం అంటే ఆయా ప్రాంతాల్ని, అక్కడి ప్రజల్ని, సంస్కృతుల్ని అవమానించడమే అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయమంత్రి ప్రతిమా భూమిక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని ఆయన వ్యాఖ్య ప్రతిబింబిస్తోందని అన్నారు.
https://twitter.com/RahulGandhi/status/1491725402741653505?s=20&t=7_p3NPewVFUNcGAiqmLDPQ
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)