కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని.. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ వారితో పాటు మరో ఆరుగురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్డున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు పలు రాష్ట్రాలముఖ్యమంత్రులు హాజరయ్యారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో.. ఆయన మద్దతు దారులు.. సీఎం సీఎం అని నినాదాలు చేస్తూ హల్ చల్ చేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ నితీశ్ కుమార్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భేగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వీందర్ సింగ్ తోపాటూ.. సినీ నటుడు కమల్ హాసన్, ఫరూఖ్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు. సీతారాం ఏచూరి, శరద్ పవార్, డీ రాజా కూడా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఇక ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాల్ని ఒక జట్టుగా కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇవాల్టి ప్రమాణస్వీకారానికి విపక్షపార్టీలన్నింటినీ ఆహ్వానించింది.