కర్నాటకలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ సీనినయర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఒకేరోజు కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 9న కోలార్లో జరిగే ప్రచారసభలో రాహుల్ పాల్గొంటారని పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయగా…అదే రోజు ప్రధాని మోదీ సైతం మైసూరులో పర్యటించనున్నారు. రాహుల్ పై సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్నీ ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈనెల 11న కేరళ వాయనాడ్లో రాహుల్ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో రాహుల్ పాల్గొంటారని పార్టీ తెలిపింది.